నాగర్ కర్నూల్ జిల్లాలో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన

నాగర్ కర్నూల్ జిల్లాలో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన

నాగర్‌కర్నూల్,:నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా 30 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు *జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్* తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 880 పోలింగ్ కేంద్రాలు ఉండగా, కొత్త ప్రతిపాదనలతో ఈ సంఖ్య 910కి చేరనుంది. అదనంగా 5 పోలింగ్ కేంద్రాల స్థాన మార్పు, 2 పోలింగ్ కేంద్రాల పేర్ల సవరణకు కూడా ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించిన అనంతరం ఓటర్లకు మరింత చేరువలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకతకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నార
Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News