భక్తిశ్రద్ధలతో మార్మోగిన సర్దార్ నగర్.. అంగరంగ వైభవంగా సరోజినీ మాత బోనాలు
- వివేక నంద కాలనిలో తొట్టెలో ఊరేగింపు
షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండలంలోని సర్దార్ నగర్లో సరోజినీ మాత బోనాల వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మామిడి కీర్తి హరిష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను నెత్తిన ఎత్తుకుని సరోజినీ మాతకు సమర్పించారు. ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది .సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన బోనాల వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. గ్రామ ప్రజల ఐక్యత, భక్తి భావం ఈ వేడుకల్లో ప్రతిబింబించింది.ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు శంకర్ రావు జాదవ్, పెండ్యాల జగదీష్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
