డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి
చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి
మందమర్రి, (మంచిర్యాల) : పుర అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి తెలిపారు. సోమవారం స్థానిక రాజీవ్ చౌక్ చౌరస్తాలో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ ఏఈ ఆశ్రిత్ తో కలిసి ఆమె పరిశీలించారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని ఏఈ,కాంట్రాక్టర్ లను ఆదేశించారు. అలాగే 17 వ వార్డులో చేపడుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను సైతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్,సీనియర్ నాయకుడు రామిడి కుమార్,మాజీ కౌన్సిలర్ రామిడి ఉమాదేవి,లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 16:12:16
మందమర్రి, (మంచిర్యాల) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక బీజోన్ సెంటర్లో...
