మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
హుస్నాబాద్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీ కట్టి, ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అలాగే మంత్రి సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవి చంద్రలకు కూడా సోదరీమణులు రాఖీలు కట్టారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలు తమ అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయంగా రాఖీ పౌర్ణమి వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా సోదర , సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


