ప్రమాదంలో గాయపడిన యువకుడికి ఆర్థిక సహాయం
త్రినేత్ర ఆసొసైటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగొని సుమన్ గౌడ్
ఎల్బీనగర్ : ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సామాజిక సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ డివిజన్ త్రినేత్ర ఆసొసైటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగొని సుమన్ గౌడ్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతున్న సాహెబ్ నగర్ కప్పల చెరువు ప్రాంతానికి చెందిన జాకబ్ అరుణ్ కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయకంగా రూపాయలు 10000 అందిం చారు. అనంతరం ముద్దగౌని సుమన్ గౌడ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవడం కోసం బాధ్యతాయు తమైన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పేదలకు సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో త్రినేత్ర సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


