పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతుల ప్రదానం
మల్యాల, : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం నగదు బహుమతులను అందజేశారు. గ్రామ ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిభ చూపిన 11 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,000 చొప్పున మొత్తం ₹11,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూవిద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారం ఆదిరెడ్డి, వార్డు సభ్యుడు పంజాల రమేష్, అనితతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 14:39:35
దౌల్తాబాద్, సిద్దిపేట: దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొనుగోలు చేసిన రైతుల నుంచి రవాణా ఖర్చు పేరుతో బస్తాకు రూ.33 చొప్పున అదనంగా వసూలు...
