ప్రజావాణి కి 13 ఫిర్యాదులు
- మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీస్ స్టేషన్ కు రావాలి.
- జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు.
నాగర్ కర్నూల్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఫిర్యాదు దారుల సమస్యల ను విని వాటినిచట్టప్రకారంపరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకుసూచనలుచేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి వచ్చిన 13 అర్జీలలో భూమికి సంబంధించిన అర్జీలు 07, తగు న్యాయం సంబంధించిన అర్జీలు 05, భార్యాభర్తల గొడవలు 01, స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసంసంబంధిత పోలీస్ స్టేషన్ కి పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది.ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీస్ సేవల్నివినియోగించుకుంటూ,వారి సమస్యలు చట్టప్రకారంపరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లుతెలియజేశారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 18:45:41
పాపన్నపేట.: ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంతో పాపన్నపేట గ్రామపంచాయతీ కారోబార్ ఆకుల కృష్ణ ప్రాణం పోయిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబాన్ని ఆదుకోవాలని మెదక్...
