ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురోహితులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దావా స్వాతి రమేష్ బాబు, వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ రత్నం సుకుమారి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్, నాయకులు ముచ్చర్ల మల్లయ్య, చిలుముల శంకర్, రత్నం ప్రదీప్ కార్యకర్తలు, అభిమానులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


