సహారా ఏజెంట్ పై దాడి చేయడం హెయమైన చర్య
భూపాలపల్లి : హనుమకొండలో సహారా కార్యకర్త గడల కుమార్పై దాడి హేయమైన చర్య: తోట రాజయ్య ఖండన.గతంలో ముల్కనూరు సహారా బ్రాంచ్ మేనేజర్గా సేవలందించిన గడల కుమార్ గారిపై నిన్న హన్మకొండలో సహారా కార్యకర్త సయ్యద్ గోర తన 10- 15 మంది అనుచరులతో కలిసి భౌతిక దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య.తెలంగాణ సహారా ఖాతాదారుల మరియు కార్యకర్తల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా చట్టపరమైన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాం. సహారా ఖాతాదారులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి: దయచేసి అందరూ సంయమనం పాటించాలి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వల్ల ఎలాంటి పరిష్కారమూ దొరకదు. అనవసరంగా కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడటం తప్ప రూపాయి ప్రయోజనం ఉండదు. సమస్యలను శాంతియుతంగా, చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలే తప్ప హింసకు తావివ్వకూడదని రాష్ట్ర సహారా సంక్షేమ సంఘం జెనరల్ సెక్రటరీ రాజయ్య అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


