మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన
మంచిర్యాల టౌన్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా బిజెపి కార్యాలయంలో బొజ్జ గణపయ్య విగ్రహాన్ని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు.ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ , భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు, కార్యకర్తలకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల స్థాయి ముఖ్య నేతలు, విభాగాలు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


