ఉచిత మట్టి గణపతుల పంపిణీ
బిచ్కుంద, : స్కాలర్స్ హై స్కూల్ బిచ్కుంద ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు, ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయ పద్ధతుల్లో వినాయక చవితి వేడుకలను నిర్వహించాలనే ఉద్దేశంతో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ మట్టి గణపతులను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


