గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ
125 మంది గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్ల పంపిణీ
శివ్వంపేట, (మెదక్): మెదక్ జిల్లా,శివ్వంపేట మండల కేంద్రంలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొని మండలంలోని పలు గ్రామాలకు చెందిన 125 మంది గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, తల్లులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు రాజన్న ఫౌండేషన్ తరఫున నిరంతరం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


