మట్టి గణపతి లను మోరల్ శ్రీనివాసరావు సహకారం తో పంపిణీ.
మట్టి గణపతి లను ఉచితంగా పంపిణీ చేయడం తో ధన్యవాదాలు తెలిపిన భక్తులు.......
బాన్సువాడ నియోజకవర్గం లో నీ ఆయా మండల కేంద్రాల్లో సోమవారం పవిత్ర గణేష్ ఉత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు సహకారం తో 1000 మట్టి గణపతి లను బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాయకుల సహకారం తో మండల కేంద్రాల్లో భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఉచిత మట్టి గణపతి పంపిణీ చేయడం తో భక్తులు ధన్యవాదాలు తెలిపారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మోరల్ శ్రీనివాసరావు సహకారం తో వినాయక చవితి పండగ సందర్భంగా 200 మట్టి విగ్రహాలు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో పర్యావరణం పరిరక్షణ భాగంగా మట్టి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుడిసెల. నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, మెగావత్ భాస్కర్, లక్ష్మణ్ చౌహాన్, మోసిన్, భూమయ్య, శ్రీను, భాస్కర్, బాబు, విట్టల్, భీమ్ రావు కుమార్ ఈ కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


