తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
శాసనసభాపతిపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ఆవుల రాజిరెడ్డి
శివంపేట (మెదక్): శివ్వంపేట మండల కేంద్రంలో తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజారెడ్డి మాట్లాడుతూ శాసనసభాపతి పదవికి గౌరవం ఉండాలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాత మధును ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, చింతల వెంకటరామిరెడ్డి, కమలా పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


