నల్లబెల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సాంబయ్య
నల్లబెల్లి(వరంగల్ జిల్లా): నల్లబెల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఈ ఎన్నికలో ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడిగా మిట్టగడపల సాంబయ్య (సాక్షి), ప్రధాన కార్యదర్శిగా సట్ల రమేష్ ( ఆంధ్రజ్యోతి ) ఎన్నికయ్యారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడిగా చిర్ర రమేష్ (జనం సాక్షి), ఉపాధ్యక్షుడిగా సామల వీరన్న (నవతెలంగాణ), కోశాధికారిగా గంగిశెట్టి నాగభూషణ్ (వార్త) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పలువురు జర్నలిస్టులు ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు సాంబయ్య మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ను మరింత బలోపేతం చేసి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

