ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీఓ గోపాల్ సమీక్ష
బిచ్కుంద :బిచ్కుంద మండల పరిధిలోని ఫత్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై బిచ్కుంద మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) గోపాల్ గారు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. అప్పులు చేసి, ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని లబ్ధిదారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామంలో మంజూరైన ఇళ్ల పురోగతిని వేగవంతం చేయా లని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రముఖ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Views: 102
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
