20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం
మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా, సమస్యల పరిష్కారం కొరకై గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియూసితో 20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉత్పత్తితో పాటు కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత,ఉత్పత్తి ఉత్పాదక సాధనలోనూ కార్మిక సంఘాల పాత్ర అత్యంత కీలకమన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఆపరేటర్లకు అవసరమైన పనిముట్లను, రెయిన్ కోట్లను ఇవ్వనున్నారు, మహిళా ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ గార్డులకు కనీస సౌకర్యాలు కల్పించనున్నారు.అలాగే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సమావేశంలో అధికారులు,యూనియన్ నేతలు పాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
