రైతుల బకాయిల కోసం బీజేపీ బైఠాయింపు.. వేములవాడలో ఉద్రిక్తత
- ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు
-
ధర్నా నిర్వహించిన నాయకుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్కు తరలింపు
వేములవాడ రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలను వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. జిల్లాలో వెలుగుచూసిన వడ్ల కుంభకోణం కారణంగా పలువురు రైతులకు ఇప్పటికీ చెల్లింపులు అందలేదని వారు ఆరోపించారు. నిరసన సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ధర్నాలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
