దౌల్తాబాద్‌లో బైక్‌ చోరీ.. నిందితుడికి రిమాండ్‌

దౌల్తాబాద్‌లో బైక్‌ చోరీ.. నిందితుడికి రిమాండ్‌

దౌల్తాబాద్,/సిద్దిపేట :దౌల్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన బైక్‌ చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గంగాధర అరుణ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం సమీపంలోని కల్లు కాంపౌండ్ వద్ద పార్క్‌ చేసిన బైక్‌ను కొండాపూర్ గ్రామానికి చెందిన వరదం యాదగిరి దొంగిలించాడు. అనంతరం వాహనాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా దౌల్తాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనాలను పార్క్‌ చేసే సమయంలో తప్పనిసరిగా లాక్‌లు, ఇతర భద్రతా పరికరాలను వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Views: 230

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి