పట్నం కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన టీపీసీసీ చీఫ్
షాబాద్,(రంగారెడ్డి) తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.శనివారం పట్నం మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మహేష్ కుమార్ గౌడ్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం పట్నం మహేందర్ రెడ్డితో పాటు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని,కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం కలగాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, కావలి చంద్రశేఖర్,పామేన భీం భరత్,షాబాద్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ దండు రాహుల్ పాల్గొని రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
