సిరిపురం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
లింగాల గణపురం (జనగాం): లింగాల ఘనపురం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా సిరిపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిటకోరు సంపత్, పీఏసీఎస్ డైరెక్టర్ వేముల కృష్ణారెడ్డి, జీడికల్ దేవస్థానం డైరెక్టర్ బస్వగాని నరేష్ గౌడ్, వార్డు సభ్యులు బస్వగాని విట్టల్, గ్రామ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల కిషోర్, గ్రామ యువజన అధ్యక్షుడు దుర్గి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


