ప్రభుత్వ కళాశాల లో నోటు పుస్తకాలు, బ్యాగ్ ల పంపిణీ
హాజరైన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరామ్
సంగారెడ్డి, :జిన్నారం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి గోవిందరామ్ ఆకస్మిక తనిఖీకి చేశారు అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ ,విద్యార్థుల హాజరు శాతం ,అంతర్గత పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహణ తనిఖీ చేశారు, జూనియర్ కళాశాల విద్యార్థుల చదువు తీరు బాగా ఉందని పరీక్షల్లో ఉత్తీర్ణశాతం చానా బాగా ఉందని ఆయన కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్, చొరవతో విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసిన నోటు పుస్తకాలు బ్యాగ్ లను ఆయన చేతిలో మీదుగా అందజేశారు. విద్యాసామాగ్రిని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించి,జీవితానికి బంగారు బాటలు వేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి, విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


