రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర 34వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చంద్రశేఖర్
జహీరాబాద్ :అల్లీపూర్ మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన దివంగత రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డా. ఎ.చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని రెవ.జార్జ్ విగ్రహానికి పులా మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర సేవలను స్మరించుకుని, జహీరాబాద్ ప్రాంతానికి వారు అందించిన సేవలు, సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు నరేష్ గౌడ్ , మాజీ పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు , కౌన్సిలర్ మహేష్ కుమార్ , సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ గారు,కాంగ్రెస్ నాయకులు రామచందర్ , జైరాజ్ , శాంసన్ ,అరవింద్ , జనార్దన్ ,మొయిజ్ , గౌస్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


