మౌలిక సదుపాయాలు కల్పన, మందుల కొరత లేకుండా చూడాలి
మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి
నిజామాబాద్ : హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఆరోగ్య సంబంధిత సమస్యలు, ప్రభుత్వ వైద్య సంస్థల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, మందుల లభ్యత, వైద్యులు మరియు సిబ్బంది అందుబాటు, ప్రజారోగ్య సేవల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్బంగా బాల్కొండ నియోజకవర్గం ఆరోగ్య శాఖ కు సంబంధించి పలు ప్రతిపాదనలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా కి అందించి మంజూరు చేయవలసిందిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వెంటనే తేవాలని , అలాగే పెండింగ్లో ఉన్న హాస్పిటల్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. భీంగల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను రాహత్ నగర్ గ్రామానికి తరలించేందుకు అనుమతి మంజూరు చేయడం, అలాగే రాహత్ నగర్లో నూతన PHC భవనం నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయడం గురించి కోరారు భీంగల్లో కొత్త పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Urban Primary Health Centre - UPHC) ఏర్పాటుకు పరిపాలనా అనుమతి మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేసారు మోర్తాడ్ మండలంలోని పాలెం లేదా తిమ్మాపూర్ గ్రామంలో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటు కోసం పరిపాలనా అనుమతి మంజూరు చేయవలసిందిగా కోరారు . బాల్కొండ మరియు మోర్తాడ్ లో కొత్త పోస్టుమార్టం భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేసారు.బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని 24×7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs) మరియు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (CHCs)లో అవసరమైన సిబ్బంది (Cadre Strength) మంజూరు చేయడం మరియు ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. . నిజామాబాద్ జిల్లా – ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) లో MRI మెషిన్ ను మంజూరు చేయాలనీ, ఖాళీ పోస్టు లను భర్తీ చేయాలనీ,అత్యవసర అవసరాల కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.

Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
