తొమ్మిదిన గాంధారి మైసమ్మ బోనాల జాతర
మందమర్రి, (మంచిర్యాల) : ఈ నెల తొమ్మిది ఆదివారం బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య తెలిపారు. సోమవారం స్థానిక ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను కమిటీ సభ్యులు విడుదల చేశారు. గత 25 సంవత్సరాలుగా మైసమ్మ తల్లి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మున్సిపల్, పోలీస్,ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఈ సంవత్సరం సైతం అత్యంత వైభవంగా బోనాల జాతర జరుపుతున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాగా జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన కార్యదర్శి టీఎం సత్య నారాయణ, కనకయ్య, మొండి, రాజయ్య, కుమార్, ఓదెలు, తిరుపతి, గట్టయ్య,పూజారి లవ కుమార్ పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
