అనాథాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం
హన్మకొండ : లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన ఆధ్వర్యంలో స్వయంకృషి వృద్ధుల అనాథాశ్రమంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్ మెంతుల శశిధర్ అన్నదానాన్ని స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సింగారం శ్రీకర్ మాట్లాడుతూ, అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరించిన లయన్ మెంతుల శశిధర్ కి కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన సభ్యుల సహకారంతో ఇకపై ప్రతి నెల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆడెపు రవీందర్, మొహమ్మద్ హఫీజ్ ఖాన్, పాక వేణు, సింగారపు చంద్రశేఖర్, పూస వినయ్, ఇల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 16:41:20
కరీంనగర్, : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
