ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
హన్మకొండ న్యూస్ : పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమరధామం యందు నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, త్యాగాల ఫలితంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకున్నారు.ప్రజలకు మరింత మెరుగైన పాలన, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత,పరకాల అమరరామం మరో జలియన్ వాలాబాగ్ అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


