స్నేహితుని కుటుంబానికి మిత్రులకు అండగా ఆర్థిక సాయం
కుటుంబానికి రూ.36 వేల ఆర్థిక సాయం
గంభీరావుపేట :గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చ చెందిన గెరిగంటి రాజు ఒక నెల క్రితం అకాల మరణం చెందిన నూతి నీ కుటుంబ సభ్యులను వారి యొక్క స్నేహితులు గురువారం పరామర్శించారు. తమతో కలిసి చదువుకున్న మిత్రుడు మృతి చెందడంతో విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రాజు కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న స్నేహితులు తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ తలకొంత చొప్పున నగదును సమకూర్చుకుని రూ.36 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించారు. ఆ మొత్తాన్ని రాజు కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


