అటవీ శాఖ అమరవీరుల స్మారకార్థం ర్యాలీ
కాటారం (భూపాలపల్లి): జాతీయ అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కాటారంలో శుక్రవారం భారీ ఎత్తున మోటార్ సైకిల్ తో ర్యాలీ నిర్వహించారు. అమరవీరులకు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. మహాదేవపూర్ ఎఫ్ డి ఓ సందీప్ ఆధ్వర్యంలో కాటారం, మహదేవ్ పూర్, పెగడపల్లి, పలిమల రేంజి అధికారులు జాడి స్వాతి, రవికుమార్, శంకర్, నాగరాజు లతోపాటు కాటారం డిప్యూటీ రేంజర్ సురేందర్ పలువురు అధికారులు పాల్గొన్నారు. సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బంది ర్యాలీలో పాల్గొని గారెపల్లి పురవీధుల గుండా మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు.
Views: 94
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Sep 2026 17:55:56
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ పట్టణంలోని గాంధీ పార్క్లో సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జలసాధన సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ...
