రాఖీలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సందడి

అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

రాఖీలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సందడి

బిచ్కుంద,: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారి క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న గారు, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారందరికీ ఆత్మీయంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్ పర్వదినం సమాజంలో సోదరభావం, ప్రేమ, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Views: 111

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు  జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
సందడిగా మారిన మంచిర్యాల మార్కెట్
రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన రఘునాథ్ వెరబెల్లి
బోధన్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దురదృష్టకరం 
తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు దళిత చైతన్య సభ వాయిదా
అనుబంధానికి ప్రతిక... రాఖీ వేడుక: ఎమ్మెల్యే కె ఆర్  నాగరాజు 
కాజీపేటలో అదనపు రైలు హాల్టులు,