మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆశాడి ఉత్సవాల ఆహ్వానం
సిద్ధిపేట / మర్కుక్ : తెలంగాణ పండరీపురంగా పేరుగాంచిన పాండురంగ ఆశ్రమంలో చారిత్రక ఆశాడి ఉత్సవాలు 25,26 న జరుగుతున్న సందర్భంగా భక్తోత్సవముగా జరిగే ఆషాడి ఉత్సవాలకు విచ్చేయాలని శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఎర్రవల్లి లో గల కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో భావానందపూర్ గ్రామ సర్పంచ్ నరిగే సత్తెమ్మ రమేష్ మర్యాదపూర్వకంగా కలసి పాండురంగాశ్రమ ఉత్సవ ఆహ్వాన పత్రిక ను అందజేశారు.వారోతో పాటు అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్,బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


