పీజీ సెట్ లో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన అశ్వినికి ఘన సన్మానం

పీజీ సెట్ లో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన అశ్వినికి ఘన సన్మానం

దోమ(వికారాబాద్ ): వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని శివారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధర్పల్లి నర్సింలు కుమార్తె ధర్పల్లి అశ్విని తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TGCPGET-2026) లో ఎంఎస్సీ ఫిజిక్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా శివారెడ్డిపల్లి గ్రామ పెద్దల సమక్షంలో అశ్వినిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఆమె సాధించిన ఈ విజయం గ్రామానికి గర్వకారణమని, ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు. అశ్విని కృషి, పట్టుదలతో ఈ ఘనతను సాధించడం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, యువత, గ్రామస్తులు పాల్గొని అశ్వినికి శుభాకాంక్షలు తెలిపారు.
Views: 42

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News