పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం
పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం
పాపన్నపేట, : మండల కేంద్రమైన పాపన్నపేటలో పద్మశాలీ కులసంఘం ఆధ్వర్యంలో ఆఖరి శ్రావణ సోమవారం సందర్భంగా గోపాల కాల్వల కార్యక్రమం,శివునికి, ఆంజనేయ స్వామీకి ప్రత్యేక అభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా ఈశ్వరాలయం ప్రధాన అర్చకులు చెరువుపల్లి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్థులచే ఉదయాన్నే లింగాభిషేకం,పత్ర పూజ, ఆంజనేయ స్వామికి చంద్రం,నవగ్రహ దేవతా పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామంలోని ఆలయాలు, ప్రధాన కుడళ్ళ వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమంలో కులస్థులు,పెద్దలు యువకులు,పిల్లలు,మహిళలు హుషారుగా పాల్గొన్నారు. కులదైవం ఆధ్వర్యంలో గ్రామస్థులకు అన్నసంతార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పద్మశాలి కులదైవం పెద్దలు, కులస్తులు,మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

