టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ : ఎమ్మార్వో దయానందం

తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈనెల 23న జరగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్ )సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభ పోస్టర్ ను మంగళవారం ఎమ్మార్వో దయానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజం అభివృద్ధికి అద్దం పట్టే ముఖ్య వృత్తి నిర్వహిస్తున్నారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు జరగబోయే మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు మండల అధ్యక్షుడు గుండగాని రాము, వంగాల వెంకన్న, పల్లా సత్యనారాయణ, గుండగాని రామకృష్ణ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


