చికెన్ కర్రీలో బొద్దింక..

హుస్నాబాద్‌లోని దాబాపై వినియోగదారుల ఆగ్రహం..

చికెన్ కర్రీలో బొద్దింక..

సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలోని రాఘవేంద్ర దాబాలో అందించిన చికెన్ కర్రీలో బొద్దింక రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలకతుర్తే మండలం దండేపల్లి గ్రామ నివాసి సిద్దిపేట నుండి అటుగా వెళుతూ భోజనం కోసం దాబాకు వెళ్లిన వంగ నవీన్ తన మిత్రుడితో కలిసి చికెన్ కర్రీ, తో పాటుగా మరికొన్ని ఆర్డర్ చేయగా, అందులో బొద్దింక కనిపించినట్లు తెలిపారు. దీనిపై హోటల్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు భోజనానికి సంబంధించిన బిల్లు వసూలు చేసి అక్కడి నుంచి పంపించారని ఆరోపించారు. ఈ ఘటనపై వంగ నవీన్ సిద్దిపేట జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ జయరాంకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో పాటు హోటల్ బిల్లు, ఘటనకు సంబంధించిన ఫోటోలను పంపినట్లు తెలిపారు. దీనికి స్పందించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సిబ్బంది కొరతతో పాటు షెడ్యూల్ బిజీగా ఉన్నందున త్వరలోనే సంబంధిత హోటల్‌ను తనిఖీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫోన్‌లో హామీ ఇచ్చినట్లు వినియోగదారులు తెలిపారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే విధంగా నాణ్యతలేని ఆహారం అందిస్తున్న హోటల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అవసరమైతే ఈ ఘటనపై కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Views: 236

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News