బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యం లో అంబేద్కర్ కు వినతి పత్రం.
బాన్సువాడ .నసురుల్లాబాద్ : కేంద్రం లో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో భారత రాజ్యాంగ కర్త అంబేద్కర్ విగ్రహాని కి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు నర్సింలు గౌడ్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 13 డిక్లరేషన్లు 420 అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయిందని ఇలాంటి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని వారు ఆవేదన చెందారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకే రక్షణ లేకుంటే సామాన్య పౌరులకు మహిళలకు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కాపాడుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ హామీల తో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారని ఆ సమయం ఆసన్నమైందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమం లో టేకుర్ల సాయిలు, లక్ష్మణ్, చౌహాన్, రమేష్, భూమయ్య, రాజు, గంగారం, డి. సాయిలు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


