బద్రిగూడెం అనిత కుటుంబానికి త్రిష ఆర్థిక సాయం

బద్రిగూడెం అనిత కుటుంబానికి త్రిష ఆర్థిక సాయం

చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని బద్రిగూడెం గ్రామానికి చెందిన అనిత ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కుమార్తె త్రిష మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించారు. అనిత అంత్యక్రియల ఖర్చుల కోసం తన వంతుగా ₹15,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.అంత్యక్రియల అనంతరం అనిత కుటుంబ సభ్యులను పరామర్శించిన త్రిష, వారికి ధైర్యం చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News