రోగులకు అందుతున్న వైద్య సేవలను పోచారం ప్రత్యక్షంగా పరిశీలించారు..
కామారెడ్డి బాన్సువాడ : బాన్సువాడ పట్టణ కేంద్రం లో ఆకస్మికం గా పాత బాన్సువాడ పల్లె దవాఖానను తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. దవాఖాన లో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షం గా పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది కి సూచించారు. అవసరమైన మందులు, సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం లో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉంటూ నివారణ చర్యలను సమీక్షిస్తూ, రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేసిన పోచారం. ఈ కార్యక్రమం లో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Views: 26
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
