మర్పల్లి లో విరబూసిన బ్రహ్మకమలం
మర్పల్లి,(వికారాబాద్): మండల కేంద్రంలోని సిద్దాపురం మానెమ్మ ఇంటి ఆవరణలో అరుదుగా పూసే బ్రహ్మకమలం పుష్పం బుధవారం రాత్రి విరబూసింది. తెల్లని రేకులతో అందంగా వికసించిన బ్రహ్మకమలాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.అరుదుగా పూసే ఈ పుష్పం విరబూయడంతో మానెమ్మ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పుష్పాన్ని భక్తిశ్రద్ధలతో దేవుడి చెంతకు చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మకమలం పూయడం శుభసూచకంగా భావిస్తామని వారు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు ఇంటికి చేరుకుని వికసించిన బ్రహ్మకమలాన్ని ఆసక్తిగా తిలకించారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
