మోగిన గజ్జెలు మార్మోగిన దరువులు

మోగిన గజ్జెలు మార్మోగిన దరువులు

  •  తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చిన బోనాల జాతర
  • కళాబిడ్డల భారీ ప్రదర్శనతో కుత్బుల్లాపూర్‌లో పండుగ సందడి

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల జాతర కుత్బుల్లాపూర్‌లో ఘనంగా జరిగింది, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పద్మావతి కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద కళల వైభవం ప్రతిబింబించింది. డప్పుల దరువులు, జానపద గీతాలు, నృత్య ప్రదర్శనలతో ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది,
కళాకారుల భారీ ప్రదర్శన:
బోనాల పండుగలో భాగంగా పలువురు కవి గాయకులు, జానపద కళాకారులు, సంప్రదాయ కళారూపాల ప్రదర్శకులు పాల్గొన్నారు. డప్పుల దరువులకు అనుగుణంగా కళాకారుల ఆటపాటలు, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నా యి, అమ్మవారికి బోనం సమర్పించే సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి,
మట్టి వాసనను మోసుకొచ్చిన కళాబిడ్డలు:
తెలంగాణ మట్టి వాసన, పల్లె జీవనశైలి, జానపద సంస్కృతి ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. డప్పు దరువులు, జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలతో కళాకారులు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. కళాకారుల ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
తెలంగాణ కళలకు పెద్దపీట:
స్థానిక కళాకారులను ప్రోత్సహించడంతో పాటు తెలంగాణ జానపద కళలు, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు, పల్లె కళలకు వేదిక కల్పించడం ద్వారా కళాకారులను ప్రోత్సహిస్తూ తెలంగాణ సంస్కృతిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరపురాని సాంస్కృతిక వేడుక:
ఆటపాటలు, డప్పు దరువులు, జానపద నృత్యాలు, సంప్రదాయ కళారూపాలతో సాయంత్రం వరకు సాగిన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. అమ్మవారి భక్తి, తెలంగాణ జానపద కళల శక్తి, కళాకారుల ఆటపాటల సందడి కలగలిసి కుత్బుల్లాపూర్ బోనాల జాతరను ఓ మరపురాని సాంస్కృతిక వేడుకగా నిలిపాయి, ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు స్వర్ణక్క, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి భూపతిరెడ్డి, జర్నలిస్టు నేతలు విరహాత్ అలీ, మారుతీ సాగర్, బాలరాజు, సుగ్రీవ్ ముదిరాజ్, బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ సాయి, పుప్పల భాస్కర్, మన్నే రాజు, సామాజిక నేత ముఖేష్, చైతన్య యాదగిరి, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేత గంధం రాములు, అంబాల మహేష్, జర్నలిస్టు లక్ష్మణ్, భాషా సంస్థ తెలంగాణ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయ్ కుమార్, దినకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు దరువు ఎల్లన్న, అంతడుపుల నాగరాజ్, కాజా పాషా, కుత్బుల్లాపూర్ కళాకారుల సంఘం సభ్యులు దరువు అంజన్న, ఎంవీ మల్లేష్, దుడ్డు రాహుల్, డప్పు రామస్వామి, జోగు వెంకట్, కరాటే శంకర్, మా పల్లె శంకర్, సాల్మన్ రాజ్, అమృతయ (సన్నీ), బాలరాజ్, హేమంత్, భాస్కర చారి, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
 
Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News