బీఆర్ఎస్ కార్యకర్త మృతి..
కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి
షాబాద్,(రంగారెడ్డి):బీఆర్ఎస్ కార్యకర్త, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు మలగళ్ల సతీష్ కుమార్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా సతీష్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జడల రాజేందర్ గౌడ్, శ్రీనివాస్, ముక్రం ఖాన్, రాజేందర్, జంగయ్య ,అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Views: 30
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:06:22
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి...
