సుల్తాన్‌పూర్‌లో గడ్డి పిచికారీ కార్యక్రమం

పాల్గొన్న గ్రామ సర్పంచ్ చంటి గీతారాణి రమేష్

సుల్తాన్‌పూర్‌లో గడ్డి పిచికారీ కార్యక్రమం

చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గడ్డి పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రతను పెంపొందించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలపై మందు పిచికారీ చేసి తొలగించారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో గడ్డి, పిచ్చి మొక్కలు అధికంగా పెరిగే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రతినిధులు మాట్లాడుతూ... గ్రామ పరిశుభ్రత కేవలం పంచాయతీ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పంచాయతీ నియమాలను పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుల్తాన్‌పూర్ గ్రామ సర్పంచ్ చంటి గీతారాణి రమేష్, ఉపసర్పంచ్ మహేష్ యాదవ్, గ్రామ కార్యదర్శి పావని, గ్రామ పెద్దలు గంట కొండయ్య, నేత అశోక్ (మేషోక్) తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొని పారిశుద్ధ్య పనులకు సహకరించారు.
Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News