చేనేత సహకార సంఘ అధ్యక్షురాలికి సన్మానం
నిజామాబాద్ : నిజామాబాద్ సోమవారం రోజు సీనియర్ సిటిజన్స్ ఫోరం నిజామాబాద్ లో కార్యవర్గ సభ్యులైన గుజ్జ రాజేశ్వరి కి ఇటీవల జరిగిన చేనేత సహకార అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించడం జరిగింది. సందర్భంగా అధ్యక్షులు కాటిపల్లి నారాయణ రెడ్డి శాలువాతో, కార్యదర్శి డా.వంగ విజయ కుమార్ బొకే సమర్పించి ఘనంగా సత్కరించారు.సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు వారిని సీనియర్ సిటిజన్స్ ఫోరంనకు సేవలతో పాటు సహాయ సహకారాలు అందచేయాలని కోరడమైనది. వారు కూడా సహ్రృధ్భావంతో సేవలు చేయగలనని విన్నవించారు. ఈ కార్యక్రమంలోకార్యవర్గ సభ్యులైన టి.భూమన్న,నల్లా రాజారెడ్డి, దొంతి లక్ష్మారెడ్డి, కర్ణం వెంకట రెడ్డి శ్రీరాములు, లింగయ్య, భూమయ్య, రవీంద్రనాథ్, గుజరాతీ రాజేశ్వర్, రంగయ్య, సిద్దిరాములు, సత్యనారాయణ,రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 17:27:19
గజ్వేల్/సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణం నుంచి రామాయంపేట వెళ్లే జాలిగామ బైపాస్ రోడ్డు సంపూర్ణంగా గుంతలమయంగా మారి, వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని...
