శేరిల్లా గ్రామంలో సర్పంచ్ బంజ లావణ్య రవి ఆధ్వర్యంలో గ్రామసభ

శేరిల్లా గ్రామంలో సర్పంచ్ బంజ లావణ్య రవి ఆధ్వర్యంలో గ్రామసభ

మెదక్ జిల్లా / వెల్దుర్తి  : వెల్దుర్తి మండలం శేరిలా గ్రామంలో గ్రామ సమస్యలపై, అభివృద్ధి పనుల గురించి ప్రజలతో మాట్లాడేందుకు శేరిల్లా గ్రామంలో సర్పంచ్ బంజ లావణ్య రవి ఆధ్వర్యంలో  గ్రామసభ నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ పెద్దలు యువకులు అందరూ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బంజ లావణ్య రవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని, గ్రామం లో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని  గ్రామ అభివృద్ధికి అందరి సహకారం కావాలని కోరారు. గ్రామస్తులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బత్తుల నవీన్ , వార్డు సభ్యులు బండ నాగరాజు గోగుల యాదగిరి, అంగన్వాడి టీచర్ దేవలత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రణీద్ గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు యువకులు  పాల్గొన్నారు.
Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

చదువే లక్ష్యంగా విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణీ చేసిన కళాశాల ప్రిన్సిపల్ చదువే లక్ష్యంగా విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణీ చేసిన కళాశాల ప్రిన్సిపల్
వెల్దుర్తి  (మెదక్ జిల్లా):   వెల్దుర్తి మండలం రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం...
పుర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి 
చేనేత సహకార సంఘ అధ్యక్షురాలికి సన్మానం
హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన కృషి విజ్ఞాన కేంద్రం విద్యార్థులు
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం
శేరిల్లా గ్రామంలో సర్పంచ్ బంజ లావణ్య రవి ఆధ్వర్యంలో గ్రామసభ
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష