ప్రజా చైతన్య ప్రదాత కాళోజీ

ప్రజా చైతన్య ప్రదాత కాళోజీ

పెద్దపల్లి  ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కృషి మరువలేనిదని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా స్పందించడం కాళోజీ ప్రత్యేకత అన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని చిన్న వయసులోనే జైలు జీవితం అనుభవించారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ప్రజల్లో స్ఫూర్తి, చైతన్యాన్ని నింపిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన రచనలు చదవాలని, యువత కాళోజీ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ ,సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ