అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సర్పంచ్ ల అరెస్ట్
- సర్పంచ్ ల పెండింగ్ బిల్లు లను వెంటనే విడుదల చేయాలి.
- మెదక్ జిల్లా సర్పంచ్ ఫోరం మాజీ ఉపాధ్యక్షులు సుంకే రమేష్
రేగోడ్ (మెదక్ ):తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లు ల కోసం అసెంబ్లీ ముట్టడి చేయడానికి రేగోడ్ మండల మాజీ సర్పంచ్ లు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా వారు వెళ్తున్న క్రమంలో మాజీ సర్పంచ్ లను ఎస్సై పోచయ్య అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్బంగా మెదక్ జిల్లా సర్పంచ్ ఫోరం మాజీ ఉపాధ్యక్షులు సుంకే రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాడి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా మాజీ సర్పంచ్ లు చేసిన పనులకు సంబందించిన బిల్లులు ఇవ్వడం లేదని ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైన పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వన్ని కోరారు.లేదంటే రానున్న రోజుల్లో రాష్ట్రమంతట ఉద్యమం చేస్తామని ప్రభుత్వన్ని హెచ్చరిం చారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు బుచ్చయ్య,సర్పంచ్ లు పోలీస్ పట్లోళ్ళ అమర్ సింహ రెడ్డి,సురేందర్,మాజీ సర్పంచ్ నర్సింలు,యువ నాయుకులు గురునాథ్ రెడ్డి,ప్రవీణ్ రావు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


