వినాయక మండపాల లడ్డు ప్రసాదం తయారీ పూజ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ
కామారెడ్డి: ప్రతి సంవత్సరం లాగానే కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వినాయక మండపాలకు అందజేసే"లడ్డు ప్రసాదం"తయారీ పూజా కార్యక్రమం బుధవారం పట్టణంలోని 25 వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత 9సంవత్సరాలుగా ఏళ్లుగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్టించే వినాయక మండపాల కు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి క్రమం తప్పకుండా ఇచ్చే లడ్డు ప్రసాదం ఈ సంవత్సరం జరుగుతుందని యువకులు, పెద్దలు, పిల్లలు అందరూ తప్పక భక్తి భావం తో వినాయకుణ్ణి కొలిచి ప్రశాంతంగా నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని బీజేపీ నాయకులకు సంప్రదిస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


