ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్,: విజన్ ఆంధ్ర:* నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలోని 16వ వార్డులో ఏర్పడిన విద్యుత్ సమస్యకు మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ తక్షణ పరిష్కారం చూపారు. హాస్పిటల్ పరిసరాల్లోని విద్యుత్ స్తంభాలకు వైర్లు లేకపోవడంతో రోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన చైర్మన్ వెంటనే స్పందించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి పోల్స్ కు వైర్లు ఏర్పాటు చేయించి కరెంట్ సమస్యను క్లియర్ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, కాంగ్రెస్ నాయకులు ఖాజకాన్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


