కే. సుదర్శన్కు ఘన వీడ్కోలు
మహబూబ్నగర్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో అసిస్టెంట్ షెడ్యూల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేసిన కే. సుదర్శన్కు జోగులాంబ గద్వాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహ సంక్షేమ అధికారులు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు డి. సునీత, AAO లక్ష్మీనారాయణ, TNGO ట్రెజరర్, వసతి గృహ సంక్షేమ అధికారుల అధ్యక్షులు శ్రీ కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సత్యనారాయణ రెడ్డితో పాటు బాబురావు, విజయ్కుమార్, మోహన్, ప్రవీణ్ రెడ్డి, మాధవి, మధులత, స్వప్నప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్కు శుభాకాంక్షలు తెలిపి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


