జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

  •  త్వరలో జిల్లాలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు
  • ఏఐ టెక్నాలజీ శిక్షణ ఇస్తాం
  • TUWJ(IJU) రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ

కామారెడ్డి : జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నిరంతరం కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ మహా సభకు వెళ్తున్న మార్గ మాధ్యమంలో జిల్లా కేంద్రంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా నేతలు ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే జిల్లాలో  జర్నలిస్టులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై జర్నలిస్టులకు సమగ్ర శిక్షణ ఇస్తామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా వార్తల సేకరణ, ఎడిటింగ్ మరియు వేగవంతంగా వార్తలను ప్రజలకు అందించడంలో జర్నలిస్టుల నైపుణ్యాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు, వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించడమే TUWJ ప్రధాన ధ్యేయమని వీరహత్ అలీ స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, కార్యదర్శి రాజేష్, కోశాధికారి వెంకటేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు అబిద్, శ్రీకాంత్, శివ తదితరులున్నారు.

Views: 50

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ